News February 11, 2025

OpenAIను కొనేందుకు మస్క్ ఆఫర్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ OpenAIపై ఎలాన్ మస్క్ కన్నేశారు. ఆయన నేతృత్వంలోని ఇన్వెస్టర్లు 97.4 బిలియన్ డాలర్లకు OpenAIను కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీ బోర్డుకు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్‌ను ఆ సంస్థ సీఈవో ఆల్ట్‌మన్ తిరస్కరించారు. కాగా మస్క్ అప్పట్లో ఈ కంపెనీలో భాగస్వామిగా ఉండేవారు. దీన్ని నాన్-ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్ కార్పొరేషన్‌గా మార్చాలని ఆల్ట్‌మన్ నిర్ణయం తీసుకోవడంతో మస్క్ వైదొలిగారు.

Similar News

News March 31, 2026

గుడ్ న్యూస్: ‘చేనేత’కు రేపట్నుంచి ‘ఫ్రీ పవర్’

image

AP: చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ పథకం రేపట్నుంచి అమలు కానుంది. నెలకు మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల చొప్పున GOVT ఫ్రీగా అందించనుంది. ఇందుకు ఏడాదికి దాదాపు ₹150CR వెచ్చించనుంది. 93,000 మగ్గాల కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ ఫ్యామిలీలకు లబ్ధి కలుగుతుంది. ఏడాదికి ఒక్కో మగ్గం యూనిట్‌కు రూ.8,640 వరకు, పవర్ లూమ్ యూనిట్‌కు రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

News March 31, 2026

కలెక్షన్ల సునామీ.. చరిత్ర సృష్టించిన ధురంధర్-2!

image

‘ధురంధర్-2’ రూ.1,390CR(గ్రాస్) కలెక్షన్లు రాబట్టింది. ఫస్ట్ పార్ట్ లైఫ్‌టైమ్ వసూళ్ల(రూ.1,350CR)ను 12 రోజుల్లోనే అధిగమించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రాల లిస్టులో 4వ స్థానానికి చేరింది. తొలి 3 స్థానాల్లో దంగల్, బాహుబలి-2, పుష్ప-2 ఉన్నాయి. ఇక కర్ణాటకలో రూ.100+CR సాధించిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది.
-ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.

News March 31, 2026

వందే భారత్‌లో ఫుడ్.. అలెర్జీకి గురైన యువతి ఫొటో వైరల్

image

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో <<19481891>>ఫుడ్<<>> తిన్న తర్వాత అలెర్జీకి గురైనట్లు ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. పెదవులు ఉబ్బిపోయిన ఫొటో, మెడికల్ బిల్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరలవుతున్నాయి. ‘వందే భారత్‌లో ఇచ్చే ఆహారం అత్యంత నాసిరకం. ఫిర్యాదు చేస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు’ అని ఆమె వాపోయారు. తన బిడ్డతో కలిసి దేవ్‌గఢ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్లు బాధితురాలు పేర్కొన్నారు.