News December 12, 2024

400 బి.డాలర్ల సంపద దాటేసిన మస్క్

image

స్పేస్ ఎక్స్, టెస్లా CEO మస్క్ సంపద 400 బి.డాలర్లు దాటింది. దీంతో ఆయన ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. స్పేస్‌ఎక్స్‌ ఇన్‌సైడర్ షేర్ ట్రేడింగ్, అగ్రరాజ్య ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన ట్రంప్ విజయం సంపదను అమాంతం పెంచాయి. ప్రస్తుతం మస్క్ సంపద 439.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ సూచీ తెలిపింది. అమెరికా ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు టెస్లా షేర్లు 65% పెరిగాయంది.

Similar News

News January 21, 2025

కోడిగుడ్డు తింటున్నారా?

image

బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతో చాలా మంది కోడిగుడ్డులోని పచ్చసొనను తినకుండా పారేస్తారు. కేవలం వైట్ మాత్రమే తింటారు. అయితే పచ్చసొనలో విటమిన్ A, D, E, B12, K, B2, B9 పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావం అయితే బ్లడ్ త్వరగా గడ్డకడుతుంది. చర్మం ఎప్పుడూ హెల్తీగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది.

News January 21, 2025

APSRTCకి కాసుల వర్షం

image

AP: సంక్రాంతి పండుగ భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న 3 రోజుల పాటు రోజుకు రూ.20కోట్లకు పైగా ఖజానాలో జమయ్యాయని తెలిపింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 9వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు వెల్లడించింది.

News January 21, 2025

ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జి.. బిల్ ఎంతంటే?

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. కాగా సైఫ్ ఆస్పత్రి పూర్తి బిల్లు రూ.40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ రూ.25 లక్షలు చెల్లించినట్లు సమాచారం. సైఫ్ నుంచి ఆస్పత్రి యాజమాన్యం రోజుకు రూ.7 లక్షలకుపైగా వసూలు చేసినట్లు టాక్. మరోవైపు సైఫ్‌ను రక్షించిన ఆటోడ్రైవర్‌కు ఓ సంస్థ రూ.11 వేల రివార్డు ప్రకటించింది.