News April 24, 2024
నేహ ఫ్యామిలీకి సంఘీభావంగా ముస్లింల ర్యాలీ

కర్ణాటక హుబ్బళ్లిలో ఎంసీఏ విద్యార్థిని నేహా హిరేమఠ్ హత్యను ఖండిస్తూ నిన్న ముస్లింలు పెద్దసంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. వారు నిర్వహించే దుకాణాలను ఒక పూట మూసివేసి, నేహ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. నిందితుడు ఫయాజ్ను శిక్షించి, నేహ కుటుంబానికి న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
Similar News
News February 13, 2026
మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, BP, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, ఫ్రూట్స్, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News February 13, 2026
గుడ్ న్యూస్.. బెంగళూరులో ఆర్సీబీ మ్యాచులు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. జస్టిస్ మైఖేల్ డి కున్హా సిఫార్సులను అమలు చేయనున్నట్లు Xలో వెల్లడించారు. టికెట్లు, ప్రేక్షకుల నియంత్రణ, స్టేడియం యాక్సెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తామని చెప్పారు.
News February 13, 2026
మహాశివరాత్రి రోజు నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న (ఆదివారం) బెంగళూరులో జంతు వధ, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఆదేశాలు జారీ చేసింది. అథారిటీ పరిధిలోని అన్ని చికెన్, మటన్, చేపల దుకాణాలు, కబేళాలను ఆ రోజు 24 గంటల పాటు మూసేయాలని ఆదేశించింది. సాంస్కృతిక ఆచారాలు, మతపరమైన సెంటిమెంట్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.


