News April 24, 2024
నేహ ఫ్యామిలీకి సంఘీభావంగా ముస్లింల ర్యాలీ

కర్ణాటక హుబ్బళ్లిలో ఎంసీఏ విద్యార్థిని నేహా హిరేమఠ్ హత్యను ఖండిస్తూ నిన్న ముస్లింలు పెద్దసంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. వారు నిర్వహించే దుకాణాలను ఒక పూట మూసివేసి, నేహ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. నిందితుడు ఫయాజ్ను శిక్షించి, నేహ కుటుంబానికి న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
Similar News
News November 14, 2025
బిహార్ రిజల్ట్స్: 6 రీజియన్లూ NDA వైపే

బిహార్లోని అన్ని రీజియన్లలో NDA భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. అంగప్రదేశ్లోని 27 సీట్లలో 23 చోట్ల ముందంజలో ఉంది. భోజ్పూర్లో 46 సీట్లలో 32, మగధలోని 47 సీట్లలో 35, మిథిలాంచల్లో 50 సీట్లలో 40, సీమాంచల్లో 24 సీట్లలో 20, తిర్హుత్లో 49 సీట్లలో 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం 191 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది. 48 చోట్ల మాత్రమే ఎంజీబీ ముందుంది. ఇక 4 చోట్ల ఇతరులు ముందున్నారు.
News November 14, 2025
రానున్న 10 ఏళ్లలో APలో ₹1 ట్రిలియన్ పెట్టుబడి: కరణ్ అదానీ

APలో రానున్న పదేళ్లలో ₹1 ట్రిలియన్ పెట్టుబడి పెట్టనున్నామని అదానీ గ్రూప్ MD కరణ్ అదానీ తెలిపారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మాట్లాడుతూ పోర్టులు, సిమెంటు, డేటా సెంటర్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఇన్వెస్టు చేస్తామన్నారు. $15 Bతో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను నెలకొల్పుతున్నట్లు వివరించారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్షమందికి ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు.
News November 14, 2025
నువ్వుల నూనెతో జుట్టు సమస్యలు దూరం

జుట్టు ఆరోగ్యానికి నువ్వుల నూనె ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు రాలడాన్ని, పొడిబారడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు జుట్టు నల్లగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు చుండ్రు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయంటున్నారు నిపుణులు.


