News April 24, 2024
నేహ ఫ్యామిలీకి సంఘీభావంగా ముస్లింల ర్యాలీ
కర్ణాటక హుబ్బళ్లిలో ఎంసీఏ విద్యార్థిని నేహా హిరేమఠ్ హత్యను ఖండిస్తూ నిన్న ముస్లింలు పెద్దసంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. వారు నిర్వహించే దుకాణాలను ఒక పూట మూసివేసి, నేహ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. నిందితుడు ఫయాజ్ను శిక్షించి, నేహ కుటుంబానికి న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
Similar News
News January 13, 2025
కేజ్రీవాల్ది తప్పుడు ప్రచారం: రమేశ్ బిధూరీ
తనను ఢిల్లీ బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పేర్కొనడాన్ని రమేశ్ బిధూరి కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని ఈ బీజేపీ నేత స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఆప్ చీఫ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ తనకు చాలా ఇచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News January 13, 2025
తెలుగు రాష్ట్రాల సీఎంల సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు CM రేవంత్, చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని కుటుంబాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకురావాలని రేవంత్ ఆకాంక్షించారు. పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
News January 13, 2025
జనవరి 13: చరిత్రలో ఈరోజు
1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం