News April 18, 2024
కింద పడటంతో నా బ్రెయిన్ దెబ్బతినింది: హీరోయిన్ తానీషా ముఖర్జీ

తన మొదటి సినిమా షూటింగ్లో కొండ మీద నుంచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైందని హీరోయిన్ తానీషా ముఖర్జీ వెల్లడించారు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ బాధతోనే షూటింగ్ పూర్తి చేశా. 2 గంటలు షూటింగ్ చేస్తే 3 గంటలు పడుకునేదాన్ని. సాధారణ స్థితికి రావడానికి ఏడాది పట్టింది’ అని తెలిపారు. ఈమె తెలుగులో కంత్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్గా చేశారు.
Similar News
News November 28, 2025
గిరిరాజ్ కళాశాలలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి

జి.జి.కళాశాలలో జ్యోతిరావు ఫూలే వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. కులవివక్షతను ఎదిరిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, స్త్రీవిద్య కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అని ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఫూలే స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం పేర్కొన్నారు. దండుస్వామి, రామస్వామి, రంజిత, నహీదా బేగం, వినయ్ కుమార్, పూర్ణచందర్ రావు, రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం
News November 28, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.


