News August 7, 2024

మోదీ వల్ల నా దేశం భద్రం: బీజేపీ శ్రేణులు

image

బంగ్లాదేశ్‌ అస్థిరత అనంతరం బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాక్, బంగ్లా, శ్రీలంక రాజకీయంగా అట్టుడుకుతున్నాయని, చైనా మాంద్యాన్ని ఎదుర్కొంటోందని చెబుతూ పోస్టర్లు షేర్ చేస్తున్నారు. మోదీ పాలన కారణంగా భారత్ భద్రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, భారత్‌లో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటూ విపక్ష పార్టీల శ్రేణులు వారికి కౌంటర్ ఇస్తున్నాయి.

Similar News

News November 21, 2025

సిద్దిపేట: వైద్య సిబ్బందిపై అగ్రహాం వ్యక్తం చేసిన కలెక్టర్

image

సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్ వెరిఫై చేశారు. ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ మాత్రమే విధులకు హాజరు కాగా, మెడికల్ ఆఫీసర్‌తో సహా మిగతా వారందరూ గైర్హాజరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News November 21, 2025

బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.