News August 7, 2024

మోదీ వల్ల నా దేశం భద్రం: బీజేపీ శ్రేణులు

image

బంగ్లాదేశ్‌ అస్థిరత అనంతరం బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాక్, బంగ్లా, శ్రీలంక రాజకీయంగా అట్టుడుకుతున్నాయని, చైనా మాంద్యాన్ని ఎదుర్కొంటోందని చెబుతూ పోస్టర్లు షేర్ చేస్తున్నారు. మోదీ పాలన కారణంగా భారత్ భద్రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, భారత్‌లో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటూ విపక్ష పార్టీల శ్రేణులు వారికి కౌంటర్ ఇస్తున్నాయి.

Similar News

News October 17, 2025

646 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే సమయం

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌)లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే (OCT 20) సమయం ఉంది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cdac.in

News October 17, 2025

షోడశోపచార పూజతో శివపథం

image

పరమశివుని అనుగ్రహం పొందడానికి శివ లింగానికి షోడశోపచార పూజ చేయడం అత్యుత్తమని శివ మహాపురాణం చెబుతోంది. ఆవాహనం నుంచి ఉద్వాసన వరకు 16 భక్తియుక్త సేవలతో స్వామిని ఆరాధించాలి. ఈ ప్రక్రియ సాధ్యం కాకపోతే.. పవిత్రమైన అభిషేకం, ప్రేమపూర్వక నైవేద్యం, భక్తితో నమస్కారాలు చేసినా సరిపోతుంది. ఈ ఆరాధనలు భక్తులను తరింపజేస్తాయి. పరమ శివుని దివ్యలోకమైన ‘శివపథాన్ని’ అందిస్తాయి. ఈ సేవలే ముక్తికి మార్గాలు. <<-se>>#SIVOHAM<<>>

News October 17, 2025

నేడు రామ ఏకాదశి.. ఏం చేయాలంటే?

image

ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశి రోజున ‘రామ ఏకాదశి’ జరుపుకొంటారు. నేడు ఏకాదశి వ్రతం చేస్తే శుభం కలుగుతుందని స్కంద పురాణం పేర్కొంది. ‘ఈ శుభ దినాన లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. తులసి ఎదుట దీపం వెలిగించి, దైవ ప్రార్థన చేయాలి. దానధర్మాలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఉపవాసం శుభప్రదం. నారాయణ జపం, రామ ఏకాదశి కథ వినడం వల్ల పుణ్యం కలుగుతుంది’ అని పండితులు చెబుతున్నారు .