News May 12, 2024
రేవంత్తో నాకు ప్రాణహాని: మోత్కుపల్లి

TG: సీఎం రేవంత్తో తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. ‘రేవంత్ కారణంగానే మాదిగలకు ఎంపీ టికెట్ రాలేదు. దీంతో మాదిగలు 50ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు. మాల సామాజిక వర్గం కంటే ఎక్కువ ఉన్నా ఒక్క టికెట్ కూడా మాకు కేటాయించలేదు. రేవంత్ అంటే ఏంటో కేవలం 100 రోజుల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. ప్రతిపక్షంలో ఉండగా అక్రమంగా రూ.కోట్లు సంపాదించుకున్నారు’ అని ఆరోపించారు.
Similar News
News December 14, 2025
అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదా.. ఎంత ప్రమాదమంటే?

మారుతున్న జీవనశైలిలో యువత లేట్ నైట్ వరకు పడుకోవట్లేదు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అర్ధరాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, ఎమోషనల్గానూ వీక్ అవుతారు. BP, షుగర్, ఒబెసిటీ, ఇమ్యూనిటీ తగ్గడం, జీవితకాలం కూడా తగ్గిపోతుంది’ అని హెచ్చరిస్తున్నారు.
News December 13, 2025
అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.
News December 13, 2025
ఓటేయడానికి వెళ్తున్నారా.. జాగ్రత్త!

TG: రేపు పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. HYD, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు బైకులపైనే వెళ్తుండటంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు యువకులు బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురై స్టేషన్ఘన్పూర్లో ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రమాదం మెదక్(D) పెద్దశంకరంపేటలో జరిగింది. బైక్పై వెళ్తున్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు.


