News April 25, 2024

దేశం కోసం మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేశారు: ప్రియాంకా గాంధీ

image

మహిళల మంగళ సూత్రాలనూ కాంగ్రెస్ వదలదంటూ మోదీ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ స్పందించారు. బెంగళూరులో మాట్లాడుతూ.. ‘యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ తన బంగారాన్ని విరాళమిచ్చారు. మా అమ్మ సోనియా దేశం కోసం తాళిబొట్టును త్యాగం చేశారు(రాజీవ్ గాంధీని ఉద్దేశించి)’ అని పేర్కొన్నారు. దేశంలో INC 55 ఏళ్లు అధికారంలో ఉందని, ప్రజల బంగారాన్ని, తాళి బొట్లను ఎప్పుడైనా లాక్కుందా? అని ప్రశ్నించారు.

Similar News

News February 5, 2025

Ace pro EV: విప్లవాత్మక లాస్ట్-మైల్ డెలివరీ

image

టాటా మోటార్స్ Ace Pro EV ని పరిచయం చేసింది, ఇది సమర్థవంతమైన లాస్ట్-మైల్ డెలివరీ కోసం రూపొందించిన అద్భుతమైన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం. 155+ కి.మీ. పరిధి, 750 కిలోల బెస్ట్-ఇన్-క్లాస్ పేలోడ్ మరియు ADAS తో సహా అధునాతన భద్రతా లక్షణాలు కలవు. స్మార్ట్ కనెక్టివిటీ, మల్టిపుల్ బాడీ కాన్ఫిగరేషన్‌లతో, జీరో ఎమిషన్స్ ను కొనసాగిస్తూ లాభదాయకత పెంచుతుందని వినియోగదారులకు మాటిస్తోంది.

News February 5, 2025

ఢిల్లీ బీజేపీదే.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్

image

ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరి 42-50, జేవీసీ పోల్ 39-45 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. కాగా కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

News February 5, 2025

ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్‌ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.

error: Content is protected !!