News May 11, 2024
నా రెండో సంతకం LTA రద్దుపైనే: చంద్రబాబు

AP: ఇంటి వద్ద పెన్షన్లు ఇవ్వకుండా జగన్ శవ రాజకీయాలు చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే అందిస్తాం. మీ భూమి మీరు అమ్ముకోవడానికి లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు. దీని ద్వారా ప్రజల భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మెగా DSCపై తొలి సంతకం, LT చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తా’ అని తెలిపారు.
Similar News
News December 11, 2025
APPLY NOW: CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(<
News December 11, 2025
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 700+ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 250+ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్లు 150+ స్థానాల్లో గెలవగా.. BJP బలపరిచిన అభ్యర్థులు 50+ స్థానాల్లో విజయం సాధించారు.
News December 11, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం బంగారం <<18528737>>ధరలు<<>> కాస్త తగ్గగా.. గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.440 పెరిగి రూ.1,30,750కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.400 ఎగబాకి రూ.1,19,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,09,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


