News May 11, 2024
నా రెండో సంతకం LTA రద్దుపైనే: చంద్రబాబు

AP: ఇంటి వద్ద పెన్షన్లు ఇవ్వకుండా జగన్ శవ రాజకీయాలు చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే అందిస్తాం. మీ భూమి మీరు అమ్ముకోవడానికి లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు. దీని ద్వారా ప్రజల భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మెగా DSCపై తొలి సంతకం, LT చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తా’ అని తెలిపారు.
Similar News
News January 23, 2026
GWL: నీళ్ల కోసం వెళ్లి.. బావిలో విగతజీవిగా తేలి.!

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని పొలంలో నీటి కోసం బావిలోకి దిగిన జయమ్మ (38) అనే మహిళ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. బొచ్చువీరాపురం గ్రామానికి చెందిన జయమ్మ, తన భర్తతో కలిసి పొలానికి వెళ్లి నీళ్లు తెచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. భర్త వెళ్లి చూసేసరికి ఆమె బావిలో విగతజీవిగా కనిపించింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని కోదండాపురం ఎస్సై తెలిపారు.
News January 23, 2026
రేషన్ బియ్యంతోపాటు నిత్యావసరాలు: ఉత్తమ్

TG: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రేషన్ బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు 2025-26 వానాకాలం సీజన్లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.
News January 23, 2026
పెరటి కోళ్ల పెంపకం.. ఈ జాతులతో అధిక ఆదాయం

కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గంగా మారింది. మేలైన జాతి రకాలతో మంచి ఆదాయం సాధించవచ్చు. పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార, గ్రామ ప్రియ, శ్రీనిధి రకాలతో మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇవి అధిక మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెంది, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఈ కోళ్ల జాతులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.


