News April 24, 2024

ప్రజల వైపు ఉండటం నా ధోరణి: విజయశాంతి

image

TG: కాంగ్రెస్ నేత విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వం వైపు కన్నా.. ప్రజల వైపు ఉండటం నాకు ఓ ధోరణి. తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్రల ప్రేరణే అందుకు కారణం కావచ్చు. ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి అధికారపక్షంలో సాధ్యపడకపోవడం కూడా ఒక వాస్తవమేమో తెలియదు. అయితే నేను గెలిపించడానికి పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యతను సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆమె తెలిపారు.

Similar News

News December 16, 2025

వెంకటేశ్ అయ్యర్‌కు రూ.7 కోట్లు

image

IPL-2026 మినీ వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను RCB రూ.7 కోట్లకు దక్కించుకుంది. గత మెగా వేలంలో ఇతడిని కోల్‌కతా రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. మినీ వేలానికి ముందు రిలీజ్ చేసింది. దీంతో వేలానికి వచ్చిన అయ్యర్‌ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. అటు రూ.75 లక్షల బేస్ ప్రైస్ ఉన్న ఆల్‌రౌండర్ దీపక్ హుడా అన్‌సోల్డ్‌గా మిగిలారు.

News December 16, 2025

అసౌకర్యంగా అనిపిస్తుంది.. కాంతార ఇమిటేషన్‌పై రిషబ్ శెట్టి

image

కాంతార సీన్‌ను బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కామెడీగా <<18446778>>అనుకరించడం<<>>పై దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పరోక్షంగా స్పందించారు. అలా చేయడం తనను అసౌకర్యానికి గురిచేస్తుందని రణ్‌వీర్ పేరెత్తకుండా చెప్పారు. ‘కాంతార దైవిక అంశాలతో రూపొందిన సినిమా. సున్నితమైన, పవిత్రమైన విషయం. దానితో మాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అందుకే మూవీ సన్నివేశాలను ఇమిటేట్ లేదా ఎగతాళి చేయవద్దని కోరుతుంటా’ అని ఓ ఈవెంట్‌లో పేర్కొన్నారు.

News December 16, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్‌తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* అల్లం, వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండాలంటే దాంట్లో కొద్దిగా ఉప్పు, కాస్త వేడి నూనె వేయాలి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలకుండా ఉంటాయి.