News January 3, 2025

నా రైలు నాలుగు గంట‌లు ఆల‌స్యం మంత్రి గారూ

image

రైళ్ల ఆల‌స్యం, స‌రిప‌డా రైళ్లు లేక‌పోవ‌డం, స్టేష‌న్ల‌లో వ‌స‌తులలేమిపై ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. వందేభారత్ స్లీప‌ర్ రైలు 180 KMPH వేగంతో దూసుకెళ్లిన వీడియోను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పోస్ట్ చేశారు. తాను ప్ర‌యాణిస్తున్న రాజ‌ధాని రైలు 4 గంట‌లు ఆలస్యంగా న‌డుస్తోంద‌ని, కొన్ని 10 గంట‌లు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయ‌ని, దాదర్ స్టేష‌న్‌లో ప‌రిస్థితి ఇదంటూ ప్రయాణికులు మంత్రికి చుర‌క‌లంటిస్తున్నారు.

Similar News

News January 22, 2025

సంతోషకరమైన దేశాల్లో ఇండియా ఏ స్థానమంటే?

image

ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-2024 ప్రకారం టాప్‌-100లో ఇండియా లేకపోవడం గమనార్హం. డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా టాప్-10 హ్యాపీయెస్ట్ కంట్రీస్‌గా నిలిచాయి. ఇండియా 126వ స్థానంలో ఉంది. ఇండియా ఈ ప్లేస్‌లో ఉండటానికి గల కారణాలేంటో మీకు తెలుసా?

News January 22, 2025

పీవీ సింధు పరాజయం

image

ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. వుమెన్స్ సింగిల్స్‌లో వియత్నాం క్రీడాకారిణి గుయెన్ టీఎల్ చేతిలో 20-22, 12-21 తేడాతో చిత్తుగా ఓడిపోయారు. తొలి నుంచి ప్రత్యర్థిపై సింధు ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు. అంతకుముందు ఇండియా ఓపెన్‌లోనూ సింధు ఓడిపోయారు.

News January 22, 2025

శారదా పీఠం భవనం కూల్చేందుకు ఆదేశాలిస్తాం: హైకోర్టు

image

AP: తిరుమలలోని శారదా పీఠం భవన నిర్మాణంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. భవనం కూల్చివేతకు ఆదేశాలిస్తామని తెలిపింది. అనుమతి లేకుండా నిర్మిస్తే ఏం జరుగుతుందో ఈ కేసు ఓ ఉదాహరణ కావాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠాన్ని ఆదేశించింది.