News March 31, 2025
మయన్మార్: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య

మయన్మార్లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న ఘోర భూకంపంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2056మంది చనిపోయినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. భూకంప తీవ్రతను ప్రపంచానికి చూపించేందుకు అక్కడికి వెళ్లిన అంతర్జాతీయ మీడియా సంస్థల్ని దేశంలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది.
Similar News
News April 2, 2025
WAQF BILL: ఆమోదం పొందడం లాంఛనమే?

కేంద్రం నేడు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. బిల్లు సభ ఆమోదం పొందడం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ప్రస్తుతమున్న 542 మందికి గాను ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. ఆమోదం పొందడానికి 272 ఓట్లు అవసరం. రాజ్యసభలో 118 ఓట్లు అవసరం కాగా 125 సంఖ్యాబలం ఉంది. మిత్రపక్షాల మద్దతుపై BJP విశ్వాసంతో ఉంది. కాగా INC, SP, TMC, DMK, AAP, శివసేన(UBT), NCP(SP) తదితర విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
News April 2, 2025
నిత్యానంద స్వామి జీవసమాధి? రూ.4 వేల కోట్ల ఆస్తులు ఆమెకేనా?

ఆధ్యాత్మిక గురువు <<15958341>>నిత్యానంద<<>>(47) జీవసమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల సంరక్షణపై చర్చ జరుగుతోంది. నిత్యానందకు వందల కోట్ల విలువైన కైలాస ద్వీపంతోపాటు తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.4 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ నిత్యానంద శిష్యురాలు, నటి రంజితకే చెందుతాయని ఆయన శిష్యులు చెబుతున్నట్లు సమాచారం.
News April 2, 2025
ఆర్సీబీ సరికొత్త చరిత్ర

IPL ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్స్టాగ్రామ్లో 18M ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ టీమ్గా నిలిచింది. ఇప్పటికే ఫాలోయింగ్లో CSK(17.8M)ను దాటేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 18వ సీజన్, విరాట్ జెర్సీ నం.18 కావడం, IG ఫాలోవర్లు 18Mకు చేరడం చూస్తుంటే కప్ తమదేనని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సీజన్లో RCB టేబుల్ టాపర్గా కొనసాగుతోంది.