News April 11, 2025

తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్ నాగేంద్రన్?

image

తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్‌గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగేంద్రన్‌ పేరును ప్రతిపాదించగా, ఇతర నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం.

Similar News

News January 19, 2026

RCET అభ్యర్థులకు FEB 2 నుంచి ఇంటర్వ్యూలు

image

AP: Ph.D కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన RCET-2024లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇవి FEB 6 వరకు జరగనున్నాయి. ఆంధ్రా, వెంకటేశ్వర, నాగార్జున, పద్మావతి యూనివర్సిటీలు, కాకినాడ, అనంతపురం JNTUలలో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని మండలి కార్యదర్శి తిరుపతి రావు పేర్కొన్నారు.

News January 19, 2026

గడువు తీరాక వెయిటింగ్ అభ్యర్థులకు నియామక హక్కు ఉండదు: SC

image

చట్టబద్ధ గడువు ముగిశాక వెయిటింగ్ లిస్టు అభ్యర్థులకు నియామక హక్కు ఉండదని SC స్పష్టం చేసింది. రాజస్థాన్ PSC దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిసులు దీపాంకర్, అగస్టీన్‌ విచారించారు. నిర్ణీత వ్యవధి ముగిసినా వెయిటింగ్ లిస్టు అభ్యర్థులకు నియామకాలు ఇవ్వాలన్న ఆ రాష్ట్ర HC ఉత్తర్వులను పక్కనపెట్టారు. నాన్ జాయినింగ్ ఖాళీల్లో తమను నియమించాలని వెయిటింగ్ లిస్టు అభ్యర్థుల వ్యాజ్యంలో హైకోర్టు ఆ ఉత్తర్వులు ఇచ్చింది.

News January 19, 2026

మోదీ బయోపిక్‌లో హాలీవుడ్ స్టార్.. బడ్జెట్ రూ.400కోట్లు

image

PM మోదీ బయోపిక్‌ను ‘మా వందే’ అనే టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పాత్రలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. క్రాంతికుమార్ డైరెక్ట్ చేస్తుండగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి రూ.400కోట్లతో నిర్మిస్తున్నారు. ‘ఆక్వామెన్’ ఫేమ్ జేసన్ మమోవాను ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. JAN 22 నుంచి కశ్మీర్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.