News September 15, 2024
రెండు రోజులు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్

AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈనెల 17న మధ్యాహ్నం వరకు ఆయనను పోలీసులు మంగళగిరి రూరల్ పీఎస్లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా దూషించడం, భయపెట్టడం, లాఠీ ఛార్జ్ వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News October 24, 2025
మల్లె సాగు – అనువైన రకాలు

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.
News October 24, 2025
APPLY NOW: సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్లో 145 పోస్టులు

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్ 145 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్ లెవల్లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వెబ్సైట్: https://www.mca.gov.in/ లేదా https://icsi.edu/
News October 24, 2025
అఫ్గాన్ బార్డర్లు క్లోజ్.. పాక్లో కేజీ టమాటా రూ.600

ఉద్రిక్తతల నేపథ్యంలో అఫ్గాన్-పాక్ బార్డర్లు ఇటీవల మూసేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల్లో ఫ్రూట్స్, వెజిటెబుల్స్, గోధుమలు, బియ్యం, చక్కెర, మందుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పాక్లో టమాటాల ధరలు 5 రెట్లు పెరిగి కిలో 600 పాకిస్థానీ రూపాయలు పలుకుతున్నాయి. యాపిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి. వ్యాపారం స్తంభించిపోయిందని, 2 దేశాలు రోజుకు $1M నష్టపోతున్నాయని అక్కడి వ్యాపార వర్గాలు తెలిపాయి.


