News October 21, 2024
నందిగం సురేశ్కు 14 రోజుల రిమాండ్
AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 21, 2024
US కంటే ఇండియా మార్కెట్ల పనితీరు భేష్: మార్క్ మోబియస్
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే వర్ధమాన మార్కెట్లు రెండింతల వృద్ధి రేటు సాధిస్తున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ తెలిపారు. అమెరికా మార్కెట్ల కంటే ఇండియా మెరుగైన పనితీరు కనబర్చిందన్నారు. ‘భవిష్యత్తులో సెమీకండక్టర్ ప్రొడక్షన్లో భారత్ లీడర్గా ఎదుగుతుందనే నమ్మకముంది. అనేక పెద్ద సెమీకండక్టర్ కంపెనీలు ఇప్పటికే భారత్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాయి’ అని NDTV సమ్మిట్లో పేర్కొన్నారు.
News October 21, 2024
కాసేపట్లో వర్షం
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో గంటలో హైదరాబాద్ నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్మ్యాన్ తెలిపారు. అలాగే భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో వానలు పడుతాయని అంచనా వేశారు. ఇప్పటికే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
News October 21, 2024
బీఎస్సీ(ఆనర్స్) సీట్ల సంఖ్య పెంపు
TG: జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ(ఆనర్స్) సీట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో అదనంగా 200 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ అవసరాలు, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేక కోటాలో ఉన్న ఈ కోర్సు ఫీజును రూ.10లక్షల నుంచి రూ.5లక్షలకు తగ్గించింది.