News March 7, 2025
పేర్ని నాని, విక్రాంత్రెడ్డికి ముందస్తు బెయిల్

AP: మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం కేసులో A6గా ఉన్న ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఇప్పటికే నాని భార్యకు కూడా బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డికి కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
Similar News
News March 26, 2025
ప్రభాస్ అలా చేస్తే ‘కన్నప్ప’ చేసేవాడిని కాదు: మంచు విష్ణు

కన్నప్ప సినిమా తీసే సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించలేదని హీరో మంచు విష్ణు చెప్పారు. అయితే శివలింగాన్ని తాకే సీన్లు చిత్రీకరించే సమయంలో నేలపై పడుకున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈ సినిమాను ప్రభాస్ చేస్తానని చెబితే తాను కన్నప్పను చేసేవాడిని కాదని పేర్కొన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కన్నప్ప నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.
News March 26, 2025
అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం సీరియస్

TG: శాంతిభద్రతలపై ప్రతిపక్ష BRS దుష్ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ను బద్నాం చేయాలని చూస్తే కుదరదన్నారు. విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే దిశ ఘటన, వామనరావు హత్య జరిగిందని తెలిపారు. <<15866506>>MMTS ఘటనపై<<>> వెంటనే స్పందించామని పేర్కొన్నారు.
News March 26, 2025
అక్టోబర్లో ఇండియాకు లియోనల్ మెస్సీ

ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇండియా రానున్నట్లు తెలుస్తోంది. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని సమాచారం. అక్టోబరులో అక్కడ జరిగే ఓ ఎగ్జిబిషన్ మ్యాచులో అర్జెంటీనా తలపడనుంది. కాగా ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో బ్రెజిల్పై అర్జెంటీనా ఘన విజయం సాధించింది. దీంతో నేరుగా 2026 ఫిఫా వరల్డ్ కప్కు అర్హత సాధించింది.