News February 28, 2025

నేషనల్ సైన్స్ డే!

image

నేడు నేషనల్ సైన్స్ డే. 1928 FEB 28న శాస్త్రవేత్త సీవీ రామన్ భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన ‘రామన్​ ఎఫెక్ట్​’ను కనుగొన్నారు. ఈ పరిశోధనతో CVRను నోబెల్ అవార్డూ వరించింది. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 1987 నుంచి ఏటా సైన్స్ డేను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్​షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా’ థీమ్‌తో సైన్స్ డే జరుపుకుంటున్నాం.

Similar News

News November 24, 2025

బీమా కంపెనీల విలీనం.. పార్లమెంటులో బిల్లు?

image

బ్యాంకుల తరహాలోనే ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లను ఒకే కంపెనీగా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. వాటిని ఆర్థికంగా మెరుగుపర్చడమే దీని ఉద్దేశం. 2018-19లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో వీటి బలోపేతానికి కేంద్రం ₹17450Cr కేటాయించింది.

News November 24, 2025

ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులకు నోటిఫికేషన్

image

పశ్చిమ బెంగాల్‌లోని <>ఎయిమ్స్ కల్యాణి <<>>172 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, DM, MCH, MSc, M.biotech, M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in/

News November 24, 2025

తాంబూలం ఇలా ఇస్తేనే ఎక్కువ ఫలితం

image

☞ తమలపాకు చివర్లు, అరటి పండ్లు చివర్లు ఇచ్చేవారి వైపు ఉండకూడదు. లేకపోతే తాంబూలం ఇచ్చిన ఫలితం దక్కదని పండితులు చెబుతారు. ☞ తాంబూలంలో తమలపాకులు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. 3, 5 ఆకులు ఇవ్వడం ఉత్తమం. ☞ తాంబూలంలో ఒకటి కన్నా ఎక్కువ పండ్లు పెట్టాలి. ☞ ఒకే రకానికి చెందిన ఒక్క పండు ఎప్పటికీ తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు. ☞ తాంబూలంలో దక్షిణ కూడా కచ్చితంగా ఉండాలి. అందుకే రూపాయి, 2 రూపాయల నాణేలు ఉంచాలి.