News February 28, 2025

నేషనల్ సైన్స్ డే!

image

నేడు నేషనల్ సైన్స్ డే. 1928 FEB 28న శాస్త్రవేత్త సీవీ రామన్ భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన ‘రామన్​ ఎఫెక్ట్​’ను కనుగొన్నారు. ఈ పరిశోధనతో CVRను నోబెల్ అవార్డూ వరించింది. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 1987 నుంచి ఏటా సైన్స్ డేను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్​షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా’ థీమ్‌తో సైన్స్ డే జరుపుకుంటున్నాం.

Similar News

News March 27, 2025

పుతిన్‌కి టైమ్ దగ్గర పడింది: జెలెన్‌స్కీ

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి టైమ్ దగ్గరపడిందని, త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిజమని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇరుదేశాల మధ్య సయోధ్య కుదర్చాలని జెలెన్‌స్కీ USను కోరుతున్నారు.

News March 27, 2025

ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.

News March 27, 2025

హీట్ వేవ్.. వారికి కిడ్నీ సమస్యలు!

image

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతకు గురవుతుంటే కష్టజీవులు మండుటెండలో చెమటోడుస్తున్నారు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారికి మూత్ర పిండాల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాధి బారిన పడిన వారిలో 60శాతం గ్రామీణులే ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. రైతులు, రోడ్డు& భవన నిర్మాణ కార్మికులు, ట్రక్ డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు.

error: Content is protected !!