News July 12, 2024
మళ్లీ దేశవ్యాప్త ఉద్యమం.. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమాన్ని చేపట్టిన సంయుక్త కిసాన్ మోర్చా మరోసారి పోరుబాట పట్టనున్నట్లు ప్రకటించింది. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, రైతుల రుణాలు మాఫీ, అన్నదాతలకు పెన్షన్ వంటి ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్, J&K, హరియాణా రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది.
Similar News
News February 7, 2025
ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?

మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగనుండటంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 2 రోజుల సెలవులు, కొత్త జాబ్స్, DFS రివ్యూను తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల గ్రాట్యుటీ వరకు IT మినహాయింపు డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.
News February 7, 2025
రేపటి లోగా బుమ్రా ఫిట్నెస్పై రిపోర్ట్!

భారత స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్నెస్పై ఫ్యాన్స్లో ఆందోళన నెలకొన్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల్లో ఫిట్నెస్పై నివేదిక రానుంది. దాని ఆధారంగా ఇంగ్లండ్తో మిగతా వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడంపై BCCI నిర్ణయం తీసుకోనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News February 7, 2025
BCల జనాభా పెరిగింది: రేవంత్

TG: తాము నిర్వహించిన కులగణనలో BCల జనాభా ఐదున్నర శాతం పెరిగిందని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో CM రేవంత్ వెల్లడించారు. బీసీల జనాభా పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని చెప్పారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అటు PCC కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వస్తుందన్నారు. ఇక తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని CM చెప్పారు.