News July 11, 2024
చైనాకు నాటో వార్నింగ్

ఉక్రెయిన్పై పోరులో రష్యాకు సహకరించడం చైనా మానుకోవాలని నాటో దేశాలు హెచ్చరించాయి. రష్యాకు డ్రాగన్ మిలిటరీ సాయం అందించకున్నా మెరుగైన వాణిజ్య సంబంధాలను కొనసాగించిందని పేర్కొన్నాయి. మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి పరికరాలను చైనా అందిస్తుండటంతో రష్యాకు ఆయుధాల తయారీ సులభమవుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా సహకారం వల్ల ఐరోపా సహా రష్యా పొరుగు దేశాలకు ముప్పు పెరుగుతోందని తెలిపాయి.
Similar News
News February 15, 2025
కోడ్ లేని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం: భట్టి

TG: MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రచారం చేయాలని I&PR, హౌసింగ్ శాఖలపై సమీక్షలో ఆయన వెల్లడించారు. ORR, RRR చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించాలని సూచించారు. మధ్య తరగతి ప్రజల కోసం LIG, MIG, HIG ఇళ్లు కట్టాలని చెప్పారు.
News February 15, 2025
ADE అక్రమాస్తులు రూ.100 కోట్లు!

TG: గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. HYD, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22ఎకరాల భూమి, ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అలాగే బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి దొరికారు. సోదాల అనంతరం సతీశ్ను అరెస్ట్ చేశారు.
News February 15, 2025
బాంబూ సాల్ట్.. కిలో రూ.30,000

ఉప్పు బ్రాండ్లను బట్టి KG ₹30-₹200 వరకు ఉంటుంది. అయితే కొరియన్/బాంబూ సాల్ట్ ధర ₹20-30K. దీన్ని తొలుత కొరియాలో తయారుచేసేవారు. వెదురు బొంగులో సముద్రపు ఉప్పును నింపి 400డిగ్రీల వద్ద కాల్చుతారు. ఇలా 9సార్లు చేస్తే స్పటిక రూపంలోకి మారుతుంది. KG తయారీకి 20D పడుతుంది. ఇందులో 73మినరల్స్ ఉంటాయి. దీన్ని వాడితే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ సర్కార్ దీన్ని తయారుచేస్తోంది.