News August 1, 2024
ప్రకృతి విలయం.. ఏడు రాష్ట్రాల్లో 32 మంది మృతి

భారీ వర్షాల ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. ఏడు రాష్ట్రాల్లో ఒక్క రోజులోనే 32 మంది ప్రాణాలు కోల్పోయారు. గరిష్ఠంగా ఉత్తరాఖండ్లో 10 మంది మృతిచెందారు. హిమాచల్ ప్రదేశ్-4, ఢిల్లీ-5, యూపీలోని గ్రేటర్ నోయిడా-2, హరియాణాలోని గురుగ్రామ్-3, రాజస్థాన్లోని జైపూర్లో- 3, బిహార్లో ఐదుగురు చనిపోయారు. ఢిల్లీలో ఒక్కరోజులో ఆ స్థాయి వర్షం కురవడం 14ఏళ్లలో ఇదే తొలిసారి.
Similar News
News March 10, 2025
‘డైటింగ్’ చేసి యువతి మృతి

బరువు తగ్గాలని చేసిన ‘డైటింగ్’ ఓ అమ్మాయి ప్రాణం తీసింది. కేరళలోని కూతుపరంబకు చెందిన శ్రీనంద(18) ఆన్లైన్లో చూసి లావు తగ్గాలనుకుంది. ఆహారం తినడం మానేసి నీరు మాత్రమే తాగేది. ఎక్సర్సైజ్లు చేసింది. దీంతో శ్రీనంద ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చూసి షాక్ అయ్యారు. శ్రీనంద బరువు 24 కేజీలకు దిగజారింది. షుగర్ లెవెల్స్, సోడియం, BP పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.
News March 10, 2025
ఉద్యమకారిణిగా నాకు అవకాశం వచ్చింది: విజయశాంతి

TG: MLC పదవి అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదని, ఉద్యమకారిణిగా తనకు కాంగ్రెస్ ఆ పదవి ఇచ్చిందని విజయశాంతి వెల్లడించారు. ‘మేమే అసలైన ఉద్యమకారులం. KCRను ఓడించేందుకు BJP గతంలో నన్ను ఆహ్వానించింది. కానీ BJP-BRS మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. అందుకే కమలం పార్టీ నుంచి బయటకు వచ్చాను. BC మహిళా నేతగా నన్ను కాంగ్రెస్లో గుర్తించారు. క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది పార్టీ నిర్ణయిస్తుంది’ అని ఆమె చెప్పారు.
News March 10, 2025
ITBP స్పోర్ట్స్ కోటాలో 133 ఉద్యోగాలు

ITBP స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, కబడ్డీ, తదితర క్రీడా విభాగాల్లో 3/4/2023 నుంచి 2/4/2025 వరకు నోటిఫికేషన్లోని పేరా (4)Dలో పేర్కొన్న క్రీడల్లో మెడల్స్ సాధించి ఉండాలి. ఈ నెల 4న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <