News August 28, 2024
రాజ్యసభలో మెజార్టీ మార్కును తాకిన ఎన్డీఏ

రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ మార్కును తాకింది. తాజా ఉపఎన్నికల్లో 12 స్థానాలకు ఎన్డీఏ+మిత్రపక్షాల అభ్యర్థులు 11 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో దాని బలం 112గా ఉంది. దీనికి తోడు ఆరుగురు నామినేటేడ్, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 237 మంది సభ్యులు ఉండగా మెజార్టీ 119గా ఉంది. INDIA కూటమి బలం 85గా ఉండగా 27 మంది సభ్యులతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
Similar News
News January 7, 2026
తల్లి వాడే పర్ఫ్యూమ్ వల్ల బిడ్డ విలవిలలాడింది!

వైద్యశాస్త్రానికే సవాలు విసిరిన ఓ వింత కేసు MH పుణేలో జరిగింది. ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి 8 నెలల పాటు ఎడతెరిపి లేని దగ్గుతో విలవిలలాడింది. వైద్యులు మందులు మార్చినా తగ్గలేదు. కానీ ఒక నర్సు సూక్ష్మ పరిశీలన అద్భుతాన్ని చేసింది. ఆ తల్లి పర్ఫ్యూమ్ వల్లే బిడ్డ దగ్గుతోందని ఆమె గుర్తించింది. దానిని వాడటం మానేయగానే పాప కోలుకుంది. కొన్నిసార్లు మనం వాడే వస్తువులే పిల్లలను ఇబ్బందిపెడతాయని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
News January 7, 2026
భారత్ మాకు విలువైన భాగస్వామి.. మోదీ ట్వీట్కు నెతన్యాహు రిప్లై

భారత్-ఇజ్రాయెల్ ప్రధానులు మోదీ, నెతన్యాహు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ప్రాంతీయ పరిస్థితుల గురించి చర్చించామని మోదీ తెలిపారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని ట్వీట్ చేశారు. ‘భారతదేశంతో ఉన్న లోతైన భాగస్వామ్యాన్ని ఇజ్రాయెల్ విలువైనదిగా భావిస్తుంది. కలిసి ఉగ్రవాదాన్ని ఓడిద్దాం’ అని నెతన్యాహు రిప్లై ఇచ్చారు.
News January 7, 2026
H-1B వీసా ప్రోగ్రామ్ రద్దు కోరుతూ బిల్

విదేశీయులు USలో ఉద్యోగాలు చేయడానికి వీలుగా ఉన్న H-1B వీసా ప్రోగ్రామ్ను రద్దు చేయాలని రిపబ్లికన్ నేత మార్జోరీ టైలర్ గ్రీన్ హౌస్లో బిల్లు ప్రవేశపెట్టారు. H-1B వీసాతో పాటు అమెరికా పౌరుల ప్రయోజనాలకు ఇమిగ్రేషన్ యాక్ట్లో పలు మార్పులను బిల్లులో ప్రతిపాదించారు. అయితే బిల్లు పెట్టి కాసేపటికే ఆమె రిజైన్ చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ బయటకు రావడంతోపాటు పలు వివాదాల్లో చిక్కుకున్నారు.


