News July 20, 2024

నీరజ్ చోప్రా ఒలింపిక్స్ ట్రైనింగ్ ఖర్చు రూ.5.72 కోట్లు?

image

భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ ట్రైనింగ్ కోసం కేంద్రం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నీరజ్ శిక్షణ కోసం రూ.5.72 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ట్రైనింగ్ కోసం రూ.3.13 కోట్లు, రెజ్లర్ వినేశ్ ఫొగట్ శిక్షణ కోసం రూ.70.45 లక్షలు ఖర్చు చేసినట్లు ఓ వార్తా పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం వీరంతా పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నారు.

Similar News

News November 20, 2025

సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌.. ఇవాళే లాస్ట్ డేట్

image

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. నేటితో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌‌కు అప్లై చేసుకోవచ్చు. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్‌ చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. వెబ్‌సైట్‌ <>https://www.cbse.gov.in<<>>

News November 20, 2025

ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>ఇస్రో<<>> -ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్- B పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమాతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/

News November 20, 2025

IIT రామయ్య@100: CM చెప్పినా సీటిచ్చేవారు కాదు!

image

TG: విద్యారంగంలో చుక్కా రామయ్య ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. 1925 నవంబర్ 20న జనగామ జిల్లా గూడూరులో జన్మించారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి, కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. తర్వాత Hydలో IIT కోచింగ్ సెంటర్‌ స్థాపించారు. CM స్థాయి వ్యక్తులు రిఫర్ చేసినా సీటు ఇచ్చేవారు కాదని స్వయంగా CBN ఒకసారి చెప్పారు. రామయ్య ఉమ్మడి ఏపీలో MLCగానూ సేవలందించారు. ఇవాళ 100వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.