News January 16, 2025
పెన్&పేపర్ పద్ధతిలో NEET UG పరీక్ష

NEET UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరీక్షను పెన్&పేపర్(OMR) పద్ధతిలో కండక్ట్ చేస్తామని ప్రకటించింది. పరీక్షను ఒకే రోజున ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని తెలిపింది. 2019 నుంచి నీట్(UG) పరీక్షను NTA నిర్వహిస్తోంది. గతేడాది ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News November 22, 2025
IIITకల్యాణిలో నాన్ టీచింగ్ పోస్టులు

IIITకల్యాణి, పశ్చిమబెంగాల్లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iiitkalyani.ac.in
News November 22, 2025
హనుమాన్ చాలీసా భావం – 17

తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయె సబ జగ జానా || హనుమంతుడి ఉద్దేశాన్ని పాటించిన విభీషణుడు లంకకు రాజయ్యాడు. ఆయన విజయానికి ఆంజనేయుడి సలహా, ఆశీర్వాదాలు ఎంతో తోడ్పడ్డాయి. ఇలా విభీషనుడిని ఆదుకున్నట్లే హనుమాన్ మనల్ని కూడా ఆదుకుంటాడు. ఎంతో విశ్వాసంతో ఆయన నామాన్ని, మంత్రాన్ని జపిస్తే.. వారిని సత్య మార్గంలో నడిపిస్తాడు. రాముడిని కొలిచేవారికి హనుమంతుని అండదండలు ఎప్పుడూ ఉంటాయని నమ్మకం.<<-se>>#HANUMANCHALISA<<>>
News November 22, 2025
T2OIWC-2026.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

భారత్, శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే మెన్స్ T2OIWCలో 20 జట్లు 4 గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. ఒక గ్రూపులో ఇండియా, పాక్, USA, నమీబియా, నెదర్లాండ్స్, రెండో గ్రూపులో ఆసీస్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ ఉంటాయని క్రిక్బజ్ వెల్లడించింది. మూడో గ్రూపులో ఇంగ్లండ్, విండీస్, ఇటలీ, బంగ్లాదేశ్, నేపాల్, నాలుగో గ్రూపులో సౌతాఫ్రికా, కివీస్, అఫ్గాన్, UAE, కెనడా ఉంటాయని తెలిపింది.


