News January 16, 2025

పెన్&పేపర్ పద్ధతిలో NEET UG పరీక్ష

image

NEET UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరీక్షను పెన్&పేపర్(OMR) పద్ధతిలో కండక్ట్ చేస్తామని ప్రకటించింది. పరీక్షను ఒకే రోజున ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని తెలిపింది. 2019 నుంచి నీట్(UG) పరీక్షను NTA నిర్వహిస్తోంది. గతేడాది ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News February 15, 2025

కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి: రకుల్

image

కంఫర్ట్ జోన్ ప్రజలను ఎదగనీయదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘మీకు అలవాటైన ప్రదేశం నుంచి బయటకు రండి. అలవాటైన ప్రాంతం అందంగా ఉంటుంది. కానీ అది మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎదగనీయదు. మీరు ఎదగాలంటే అక్కడి నుంచి బయటపడాలి. కఠినమైన విషయాలు నేర్చుకోవాలి. కొత్తదనాన్ని కోరుకోవాలి. సుఖవంతమైన జీవితం అందరినీ బద్ధకస్థులుగా మారుస్తుంది.’ అంటూ రాసుకొచ్చారు.

News February 15, 2025

14 ఏళ్లకే లక్ష మొక్కలు నాటింది

image

తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 14 ఏళ్ల ప్రసిద్ధి సింగ్ లక్ష మొక్కలు నాటారు. ‘ప్రసిద్ధి ఫారెస్ట్ ఫౌండేషన్’ స్థాపించి ‘చెట్ల అమ్మాయి’గా ప్రసిద్ధి పొందారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఆమె మొక్కలు నాటారు. 110 ప్రాంతాల్లో 1.3 లక్షలకుపైగా వాటిని నాటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అడవుల కోసం ఆమె చేస్తున్న కృషికిగానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం PM రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రకటించింది.

News February 15, 2025

గాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారు: సీఎం

image

సంత్ సేవాలాల్ APలో పుట్టినా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సేవ చేశారని CM చంద్రబాబు కొనియాడారు. సచివాలయంలో జరిగిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహాత్మాగాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారని చెప్పారు. బ్రిటీష్ కాలంలో మతమార్పిడులపై పోరాడారని, ఈనాడు మనం ఆచరిస్తున్న ఆర్థిక విధానాలను ఆయన అప్పుడే బోధించారని పేర్కొన్నారు. గిరిజనుల్లోని వెనుకబాటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

error: Content is protected !!