News January 4, 2025
AP-TG మధ్య కొత్త వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు AP CM చంద్రబాబు ప్రకటించిన <<15020850>>బనకచర్ల ప్రాజెక్టుపై<<>> తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని CM రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ అభ్యంతరాలను AP CSకు పంపాలని ఆయన సూచించారు. అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు.
Similar News
News April 14, 2026
CSKతో మ్యాచ్.. టాస్ గెలిచిన KKR

IPL 2026: చెన్నైతో జరగనున్న మ్యాచులో KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
CSK: శాంసన్, గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్, శివమ్ దూబే, బ్రెవిస్, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
KKR: రహానె, గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, నరైన్, రమణ్దీప్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.
News April 14, 2026
ఇప్పుడు రాజకీయంగానూ దెబ్బతింటాం: రేవంత్

TG: ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక వివక్ష ఎదుర్కొంటున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ‘బిహార్, UP నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయం కంటే వాళ్లు పొందేదే ఎక్కువ. కానీ నా రాష్ట్రం తెలంగాణ పొందే దాని కంటే ఇచ్చేదే ఎక్కువ. ఇప్పుడు LS సీట్లు పెంచితే రాజకీయంగానూ దెబ్బతింటాం. ఎక్కువ జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు సరికాదు’ అని మోదీకి లేఖ రాశారు.
News April 14, 2026
ఐపీఎల్: SRHలోకి కొత్త ప్లేయర్

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మరో ఫాస్ట్ బౌలర్ వచ్చారు. గాయంతో టోర్నీకి దూరమైన బ్రైడన్ కార్స్(ENG) స్థానంలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ అఫీషియల్గా ప్రకటించింది. రూ.75లక్షల ప్రైస్తో ఆయన్ను తీసుకుంది. మధుశంక గతంలో ముంబై ఇండియన్స్కు ఆడారు. SL తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 19 టీ20ల్లో మొత్తం 70 వికెట్లు పడగొట్టారు.


