News August 5, 2024
రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి: డిప్యూటీ సీఎం భట్టి

TG: రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షన్నర వరకూ రుణమాఫీ చేశామన్నారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెద్ద మొత్తంలో రికవరీ జరిగిందని, దీని వల్ల బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. సహకార బ్యాంకుల్లో రుణమాఫీ విషయంలో వచ్చిన ఇబ్బందులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 9, 2026
మోదీ, ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారు: విదేశాంగ శాఖ

భారత్తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి మోదీ <<18806375>>ఫోన్ చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. ‘వాణిజ్య ఒప్పందంపై గతేడాది ఫిబ్రవరి నుంచి 2 దేశాలు చర్చలు జరిపాయి. చాలాసార్లు మేం డీల్కు చేరువయ్యాం. చర్చలపై తాజాగా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. గతేడాది మోదీ, ట్రంప్ 8సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు.
News January 9, 2026
అస్సోం రైఫిల్స్ 95 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 9, 2026
మారేడు దళాల గురించి ఈ విషయాలు తెలుసా?

మారేడు చెట్టును ఇంట్లో పెంచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. దీని దళాలు కోసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. సోమ, మంగళ, శుక్రవారాలు, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథుల్లో వీటిని కోయకూడదు. ఒకసారి శివుడికి అర్పించిన ఆకులను కడిగి తిరిగి 30 రోజుల వరకు పూజకు ఉపయోగించవచ్చు. నేల మీద పడినా ఇవి దోషం కావు. శివార్చనలో మారేడు దళాలను కొబ్బరి నీళ్లలో ముంచి సమర్పిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.


