News March 2, 2025
అమావాస్య ఎఫెక్ట్.. ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ డేట్లో మార్పు

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాను ఈనెల 28న రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. 29న రిలీజ్ చేయాల్సి ఉండగా, ఆరోజు అమావాస్య ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లు ఒక రోజు ముందుగా రిలీజ్ చేయమని కోరారని వెల్లడించారు. అంతే తప్ప వేరే కారణం లేదని, అదే రోజు రిలీజ్ అవుతున్న నితిన్ ‘రాబిన్హుడ్’ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందిన సంగతి తెలిసిందే.
Similar News
News March 19, 2025
ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి: మంత్రి నాదెండ్ల

AP: దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతలకు అందుబాటులో 5 లక్షల గన్నీ సంచులున్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News March 19, 2025
అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి: సుప్రీం

దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దేశంలో దాదాపు 80 శాతం మంది నిరుపేదలు ఉన్నారని, వారందరికీ ఆహార భద్రత ఎంతో అవసరమని పేర్కొంది.
News March 19, 2025
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
✤ రూ.2 వేల కంటే తక్కువ లావాదేవీలకు (పర్సన్ టు మర్చంట్) యూపీఐ ఛార్జీలు ఉండవు
✤ అస్సాంలో రూ.10,601 కోట్లతో అమ్మోనియా, యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు
✤ మహారాష్ట్రలో రూ.4,500 కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవే
✤ గోకుల్ మిషన్కు రూ.3,400 కోట్లు.