News August 3, 2024
త్వరలో కొత్త NCA ఓపెనింగ్: జైషా

బెంగళూరులో నిర్మిస్తోన్న కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించారు. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో 3 వరల్డ్ క్లాస్ ప్లేయింగ్ గ్రౌండ్స్, 45 ప్రాక్టీస్ పిచ్లు, ఇండోర్ క్రికెట్ పిచ్లు, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయని పేర్కొన్నారు. క్రికెటర్లు తమ స్కిల్స్ మెరుగుపరుచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


