News August 12, 2024

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. అలా చేస్తే సిమ్ బ్లాక్

image

నకిలీ, స్పామ్ కాల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్ అమలు చేయనుంది. వ్యక్తిగత ఫోన్ నంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చాలని TRAI స్పష్టం చేసింది.

Similar News

News November 27, 2025

పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

image

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్‌కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News November 27, 2025

భాస్వరం, నత్రజని ఎరువులను ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం?

image

పంట నాటిన/విత్తిన రెండు వారాలలోపే మొత్తం భాస్వరం ఎరువులను పంటలకు వేయాలి. పైపాటుగా వాడకూడదు. నత్రజని, పొటాష్ ఎరువులను పూతదశకు ముందే వేసుకోవాలి. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా మూడు దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సూక్ష్మపోషక ఎరువులను పంటకు స్ప్రే రూపంలో అందించాలి.

News November 27, 2025

అటు అనుమతి, ఇటు విరాళం.. టాటా గ్రూపుపై సంచలన ఆరోపణలు!

image

BJPకి టాటా గ్రూపు లంచం ఇచ్చిందంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూపు, BJPపై scroll.in రాసిన కథనాన్ని షేర్ చేశారు. ‘సెమీకండక్టర్ యూనిట్లకు మోదీ క్యాబినెట్ ఆమోదం తెలపగానే BJPకి అతిపెద్ద దాతగా టాటా గ్రూపు ఎలా మారింది? 2 యూనిట్లకు సబ్సిడీ కింద ₹44,203Cr టాటాకు వస్తాయి. క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన 4 వారాలకు ₹758Crను BJPకి విరాళంగా ఇచ్చింది. ఇది లంచం’ అని ట్వీట్ చేశారు.