News August 4, 2024

వచ్చే ఏడాది హజ్ యాత్రకు కొత్త నిబంధనలు

image

TG: వచ్చే ఏడాది హజ్ యాత్రకు మక్కా వెళ్లేవారికి హజ్ కమిటీ కొత్త నిబంధనల్ని ప్రకటించింది. యాత్రికులకు పాస్‌పోర్టులో 2026 జనవరి 31 వరకు వాలిడిటీ, మెషీన్ రీడబిలిటీ ఉండాలని తెలిపింది. దానికి తగ్గట్టుగా యాత్రికులు తమ పాస్‌పోర్టుల్ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. 2025 జులై చివర్లో లేదా ఆగస్టు తొలివారంలో హజ్ యాత్ర ఉండనుంది. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 11,378మంది మక్కాకు వెళ్లారు.

Similar News

News December 17, 2025

స్పీకర్ తీర్పు రాజ్యాంగవిరుద్ధం: BRS ఎమ్మెల్యే

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ <<18592868>>తీర్పు<<>> రాజ్యాంగవిరుద్ధమని BRS ఎమ్మెల్యే వివేకానంద ఫైరయ్యారు. ఆయన తీర్పుపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అనర్హత పిటిషన్లను వేటి ఆధారంగా డిస్మిస్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ ఖూనీ చేస్తోందని, స్పీకర్ నిర్ణయం ఊహించిందేనని మండిపడ్డారు. దమ్ముంటే ఫిరాయింపు MLAలను రాజీనామా చేయించి ఉపఎన్నిక నిర్వహించాలని సీఎం రేవంత్‌కు సవాల్ చేశారు.

News December 17, 2025

స్పీకర్ నిర్ణయంతో BRSకు షాక్

image

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న <<18592868>>MLA<<>>లపై అనర్హత వేటు పడితే ఉపఎన్నికలు వస్తాయని BRS ఆశించింది. అందుకోసం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాడుతోంది. కానీ తాజాగా స్పీకర్.. ఐదుగురు MLAలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయంతోనే ఏకీభవించనుంది. దీంతో ఉపఎన్నికల్లో గెలుస్తామని భావించిన కారు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా ఇప్పటికే 2 ఉపఎన్నికల్లో BRS ఓటమిపాలైన విషయం తెలిసిందే.

News December 17, 2025

AIతో అసభ్యకర ఫొటోలు.. బాధించాయన్న శ్రీలీల

image

ఏఐ సాయంతో SMలో తన ఫొటోలను అసభ్యంగా ఎడిట్ చేయడంపై హీరోయిన్ శ్రీలీల స్పందించారు. ఏఐని అసభ్యత కోసం వినియోగించడాన్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడిస్తూ కోరారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ జీవితాన్ని మరింత సులభతరం చేయాలని, ఇబ్బందులు సృష్టించొద్దని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏఐని తప్పుగా వినియోగించడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా నిలవాలని అభిమానులను ఆమె కోరారు.