News April 10, 2025
రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల

TG: రైతుల కోసం ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్లో CM రేవంత్ ఈ స్కీమ్ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40వేల మంది రైతులకు 2500-3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు.
Similar News
News November 18, 2025
కొచ్చిన్ షిప్యార్డ్లో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.
News November 18, 2025
కొచ్చిన్ షిప్యార్డ్లో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.
News November 18, 2025
నేడు కృష్ణాంగారక చతుర్దశి

ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని ‘కృష్ణ అంగారక చతుర్దశి’ అని అంటారు. ఈ పవిత్ర దినానికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందట. గ్రహణం రోజున చేసే పూజలు, దానధర్మాలు అద్భుత ఫలితాలు ఇచ్చినట్లే, ఈరోజున కూడా కొన్ని ప్రత్యేక కార్యాలు చేస్తే శుభ ఫలితాలు, అదృష్టం పొందవచ్చని నమ్మకం. నేడు శివారాధన, గణపతి పూజలు చేస్తే సకల పాపాలు తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు.


