News June 23, 2024
ఈనెల 26 నుంచి అమల్లోకి కొత్త టెలికం చట్టం

దేశంలో కొత్త టెలికం చట్టం-2023 ఈనెల 26 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ నెట్వర్క్నైనా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజల భద్రత ప్రయోజనాల కోసం టెలికమ్యూనికేషన్ సేవల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వాల తరఫున నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు కూడా ఈ అధికారం ఉంటుంది.
Similar News
News December 15, 2025
లోకేశ్ వెళ్తున్న విమానం దారి మళ్లింపు

AP: ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కారణంగా మంత్రి లోకేశ్ వెళ్తున్న విమానాన్ని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరగా, విమానాన్ని జైపూర్కు పంపారు. పొగమంచు కారణంగా ఢిల్లీలో ఇప్పటిదాకా 40 విమానాలు రద్దయ్యాయి. మరో 4 విమానాలను దారి మళ్లించారు. మరోవైపు విదేశీ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీ విమానం <<18569475>>ఆలస్యమైన<<>> విషయం తెలిసిందే.
News December 15, 2025
వారిది పాకిస్థాన్.. ఐసిస్తో లింకులు!

ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన <<18568131>>తండ్రీకొడుకులు<<>> పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. బాండీ బీచ్లో వారి కారుపై ఐసిస్ జెండాలను అధికారులు గుర్తించారు. ప్రాణాలతో పట్టుబడిన నవీద్ అక్రమ్కు ఐసిస్తో సంబంధాలున్నట్లు సమాచారం. ఆరేళ్ల కిందట అతడిపై దర్యాప్తు చేసినట్లు ఆసీస్ మీడియా తెలిపింది. నిందితుల్లో ఒకరు నిఘా రాడార్లో ఉన్నప్పటికీ, అతడి నుంచి తక్షణ ముప్పులేదని సీరియస్గా తీసుకోలేదని సమాచారం.
News December 15, 2025
సూర్యకుమార్ చెత్త రికార్డు

IND ప్లేయర్ సూర్యకుమార్ T20Iల హిస్టరీలోనే చెత్త రికార్డు నమోదు చేశారు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యల్ప యావరేజ్(14.20)తో <<18568094>>పరుగులు<<>> చేసిన కెప్టెన్గా నిలిచారు. ఇతని కంటే ముందు రువాండ కెప్టెన్ క్లింటన్ రుబాగుమ్య(12.52) ఉన్నారు. కానీ ICC టాప్-20 జట్లలో ఆ టీమ్ లేదు. అలాగే ఒక ఏడాదిలో(కనీసం 10 inngs) అత్యల్ప యావరేజ్ నమోదుచేసిన రెండో ఇండియన్ బ్యాటర్గా SKY నిలిచారు. 2022లో అక్షర్ పటేల్ యావరేజ్ 11.62గా ఉంది.


