News June 23, 2024

ఈనెల 26 నుంచి అమల్లోకి కొత్త టెలికం చట్టం

image

దేశంలో కొత్త టెలికం చట్టం-2023 ఈనెల 26 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ నెట్‌వర్క్‌నైనా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజల భద్రత ప్రయోజనాల కోసం టెలికమ్యూనికేషన్ సేవల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వాల తరఫున నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు కూడా ఈ అధికారం ఉంటుంది.

Similar News

News December 28, 2025

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ అసంతృప్తి!

image

మహిళల డ్రెస్సింగ్‌పై <<18683153>>నాగబాబు<<>> రిలీజ్ చేసిన వీడియోపై కొందరు మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక ఇష్యూలు ఉండగా అనవసరమైన విషయాలను టచ్ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ వల్ల ప్రత్యర్థులకు టార్గెట్ అవ్వడం తప్ప ఎలాంటి లాభం లేదంటున్నారు. అయితే నాగబాబు ఎమ్మెల్సీగా, పార్టీ నేతగా కాకుండా సామాన్యుడిలా అభిప్రాయం చెప్పారని మరికొందరు అంటున్నారు. దీనిపై మీ COMMENT?

News December 28, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <>బుక్ చేసుకోండి<<>>.

News December 28, 2025

కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: మోదీ

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచమే ఆశ్చర్యపోయిందని PM మోదీ అన్నారు. ‘ఏడాది చివర్లో అయోధ్య రామ మందిరంపై పతాకావిష్కరణతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయింది. ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది. స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. కొత్త ఆశలు, సంకల్పంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు దేశం సిద్ధం’ అని ‘మన్ కీ బాత్’లో చెప్పారు.