News September 22, 2024
త్వరలో కొత్త పాఠ్యపుస్తకాలు

TG: నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్(NCF) ప్రకారం కొత్త పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ దశలవారీగా రూపొందించనుంది. 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పుస్తకాల్లో మార్పులు చేశారు. అయితే 2023లో కేంద్రం విడుదల చేసిన ఎన్సీఎఫ్ ప్రకారమే కొత్త కరిక్యులం రూపొందించాల్సి ఉంది. తొలుత నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు, ఆ తర్వాత తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలకు కొత్త కరిక్యులాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 16, 2026
ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
News January 16, 2026
యెమెన్ ప్రధాని సలేం బిన్ బ్రేక్ రాజీనామా

యెమెన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి సలేం బిన్ బ్రేక్ రాజీనామా చేయగా, విదేశాంగ మంత్రి షయా మొహ్సిన్ అల్ జిందానీ కొత్త PMగా నియామకం అయ్యారు. యెమెన్ పాలక ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ యెమెన్లో నెలకొన్న ఉద్రిక్తతలు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల మధ్య ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
News January 16, 2026
నేడు ఫిరాయింపు MLAల కేసు విచారణ

TG: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కేసును జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారించనుంది. 2023 ఎన్నికల్లో గెలిచిన 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరినట్లు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే <<18864508>>నిర్ణయం<<>> తీసుకున్నారు. ఈ విషయాన్ని 3 నెలల్లో తేల్చాలంటూ గతంలో సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది.


