News September 22, 2024

త్వరలో కొత్త పాఠ్యపుస్తకాలు

image

TG: నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్(NCF) ప్రకారం కొత్త పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ దశలవారీగా రూపొందించనుంది. 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పుస్తకాల్లో మార్పులు చేశారు. అయితే 2023లో కేంద్రం విడుదల చేసిన ఎన్సీఎఫ్ ప్రకారమే కొత్త కరిక్యులం రూపొందించాల్సి ఉంది. తొలుత నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు, ఆ తర్వాత తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలకు కొత్త కరిక్యులాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News July 9, 2025

ప్రేయసి IPS అవ్వాలని ప్రియుడు ఏం చేశాడంటే?

image

ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటారు. అయితే, అందరిలా కాకుండా ఇతడు మాత్రం తన ప్రేయసి కోసం కావడి మోశారు. తాను ఇంటర్ పాసయ్యానని, ప్రేయసి IPS అయ్యేవరకూ ఇలా నీరు తెచ్చి దేవుడికి సమర్పిస్తూనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

News July 9, 2025

‘మెగా 157’: పోలీసులుగా చిరు, వెంకీ?

image

చిరంజీవి-నయనతార కాంబోలో అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మెగా 157’లో తన క్యామియో ఉంటుందని <<16974411>>వెంకటేశ్<<>> చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది క్యామియో కాదని.. దాదాపు గంటసేపు ఆ పాత్ర ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పైగా, చిరు-వెంకీ అండర్ కవర్ పోలీసులుగా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని టీటౌన్‌లో ప్రచారం మొదలైంది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఇద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంటుందని తెలుస్తోంది.

News July 9, 2025

కృష్ణమ్మలో గోదావరి జలాలు.. మంత్రి పూజలు

image

AP: పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు కృష్ణమ్మలో కలిశాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పవిత్ర సంగమంలో మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చారు. రూ.1,300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే ఇప్పటివరకు 428 TMCలకు పైగా కృష్ణాకు తరలించామని తెలిపారు. చంద్రబాబు ముందుచూపు వల్లే గోదావరి జలాలతో కృష్ణా డెల్టాలో పంటలు పండుతున్నాయని, ఆయన ముందుచూపుకు ఈ ప్రాజెక్టే ఒక ఉదాహరణ అని అన్నారు.