News October 26, 2024
NEW TREND: UK, US వద్దు, ఇటలీ ముద్దంటున్న AP, TG స్టూడెంట్స్

ఉన్నత విద్య కోసం ఇటలీకి వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ ఖర్చు, పరిస్థితులు బాగాలేకపోవడంతో UK, US, కెనడాకు ఆల్టర్నేటివ్ ఆప్షన్లు వెతుకుతున్నారు. 2023లో ఇటలీ 93,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ను తీసుకుంది. ఇందులో 6100 మంది భారతీయులుండగా, 20% AP, TG వాళ్లేనని TOI తెలిపింది. 2025లో ఇటలీకి వెళ్లే భారతీయుల సంఖ్య 22%, 2030కి 500% పెరుగుతుందని అంచనా. అక్కడ రూ.10లక్షల్లోపే ఖర్చవుతోంది.
Similar News
News July 11, 2025
ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

ఎలాన్ మస్క్కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <