News April 22, 2025
NGKL: BRS వాళ్లు విమర్శలు మానుకోవాలి: ఎమ్మెల్యే

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రజా ప్రభుత్వంపై BRS వాళ్లు విమర్శలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి హితవు పలికారు. NGKL వ్యవసాయ మార్కెట్ యార్డ్లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొని ప్రభుత్వం రైతులకు బాసటగా నిలిచిందన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణారావు పాల్గొన్నారు.
Similar News
News April 23, 2025
రేపు ఉదయం 10 గంటలకు..

AP: రాష్ట్రంలో రేపు ఉదయం 10 గంటలకు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షలతోపాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ రిజల్ట్స్ కూడా విడుదల కానున్నాయి. ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ALL THE BEST
News April 23, 2025
వికారాబాద్: సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉన్నతాధికారులతో కలిసి రెవెన్యూ గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్ పథకాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News April 23, 2025
పహల్గాం దాడి కలచివేసింది: ట్రంప్

J&K పహల్గాం దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ‘చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాని మోదీకి, భారతీయులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీకు మా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు.