News August 9, 2024
పాక్ టెస్ట్ జట్టు కోచ్గా నీల్సన్

పాకిస్థాన్ టెస్టు జట్టు హై ఫర్ఫార్మెన్స్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ టిమ్ నీల్సన్ను పీసీబీ నియమించింది. ఈ నెల 21 నుంచి బంగ్లాదేశ్తో జరగబోయే టెస్టు సిరీస్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్గా జాసన్ గిలెస్పీ ఉన్నారు. వీరిద్దరూ కలిసి జట్టును నడిపించనున్నారు. కాగా నీల్సన్ 2007 నుంచి 2011 వరకు ఆసీస్కు హెడ్ కోచ్గా వ్యవహరించారు.
Similar News
News November 16, 2025
అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.
News November 16, 2025
కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
News November 16, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని CM రేవంత్ను R.కృష్ణయ్య కోరారు. నేడు రాష్ట్రంలో BC న్యాయసాధన దీక్షలు చేయనున్నారు.
*BRS కార్యకర్తలపై తాము దాడి చేశామని KTR చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని జూబ్లీహిల్స్ MLAగా ఎన్నికైన నవీన్ యాదవ్ తెలిపారు.
*సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ACB మరోసారి దాడులు చేసింది. సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


