News August 9, 2024
పాక్ టెస్ట్ జట్టు కోచ్గా నీల్సన్

పాకిస్థాన్ టెస్టు జట్టు హై ఫర్ఫార్మెన్స్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ టిమ్ నీల్సన్ను పీసీబీ నియమించింది. ఈ నెల 21 నుంచి బంగ్లాదేశ్తో జరగబోయే టెస్టు సిరీస్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్గా జాసన్ గిలెస్పీ ఉన్నారు. వీరిద్దరూ కలిసి జట్టును నడిపించనున్నారు. కాగా నీల్సన్ 2007 నుంచి 2011 వరకు ఆసీస్కు హెడ్ కోచ్గా వ్యవహరించారు.
Similar News
News December 1, 2025
ఎయిర్పోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది: కేంద్రం

ఇటీవల ఢిల్లీలో విమాన సర్వీసుల రద్దుకు GPS స్పూఫింగ్ కారణమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. HYD, ముంబై, బెంగళూరు, కోల్కతా, అమృత్సర్, చెన్నైలకూ ఫేక్ సిగ్నల్స్ వచ్చాయన్నారు. శాటిలైట్ నావిగేషన్లో ఇలా జరగడంతో వెంటనే గ్రౌండ్ నావిగేషన్, సర్వైలెన్స్ యాక్టివేట్ చేశామని MP నిరంజన్ రెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ సిగ్నల్స్ సోర్స్ గుర్తించే పనిలో కేంద్రం ఉందన్నారు.
News December 1, 2025
కాంగ్రెస్కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్కు ఆ పార్టీ MP శశిథరూర్కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.
News December 1, 2025
సంస్కరణల ప్రభావం.. నవంబర్లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.


