News April 11, 2025
నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక <<16045416>>నిఖిత(17)<<>> అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం గంటల వ్యవధిలోనే నిఖితకు అంత్యక్రియలు జరిపారు. వేరే కులానికి చెందిన అజయ్ అనే యువకుడిని నిఖిత ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇది తెలిసి పేరెంట్స్ ఆమెను మందలించి, అబార్షన్ చేయించారు.
Similar News
News January 23, 2026
ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలి: RS ప్రవీణ్

TG: ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలని BRS నేత RS ప్రవీణ్ కుమార్ చెప్పారు. ‘దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ట్యాపింగ్ చేయడం సర్వసాధారణం. ఇలా చేయొచ్చని చట్టమే చెబుతోంది. ఫోన్లు, ఈమెయిల్స్ ట్యాపింగ్ చేస్తున్నామని గతంలో మన్మోహన్ పార్లమెంటులో చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ట్యాపింగ్ జరుగుతున్నా ఎక్కడా చర్చ లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని ఈ ప్రభుత్వం బజారున పడేసింది’ అని మండిపడ్డారు.
News January 23, 2026
వింతల ప్రపంచం.. గ్రీన్లాండ్ ప్రత్యేకతలివే

ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్లో 80% ప్రాంతం మంచుతోనే నిండి ఉంటుంది. కేవలం 56,000 జనాభా కలిగిన ఈ దేశంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లడానికి రోడ్లు ఉండవు. పడవలే ప్రయాణ సాధనం. ఇక్కడి గాలి, నీరు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవి. చెట్లు దాదాపుగా లేని ఈ గడ్డపై ప్రజలు మనుగడకు వేట, ఫిషింగ్పైనే ఆధారపడతారు. డెన్మార్క్, ఐస్లాండ్ నుంచి మాత్రమే చేరుకోగల ఈ దేశంలో అర్ధరాత్రి సూర్యుణ్ని చూడొచ్చు.
News January 23, 2026
జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా TN అసెంబ్లీలో తీర్మానం

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు చేరింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరు తీసేసి జీ రామ్ జీగా మార్చడాన్ని DMK వ్యతిరేకిస్తూ వస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే పంజాబ్, TG ప్రభుత్వాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.


