News March 17, 2024

నిర్మల్: హోటల్లు, మిల్క్ సెంటర్ యజమానులకు జరిమానా

image

నిర్మల్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టణంలో శనివారం తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని హోటల్లు, మిల్క్ సెంటర్ యజమానులకు జరిమానా విధించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వాసు రామ్ తెలిపారు. మూడు హోటల్లు, మూడు మిల్క్ సెంటర్లకు రూ. 92000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వ్యాపారస్తులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ఆహారాన్ని కల్తీ చేయవద్దని సూచించారు.

Similar News

News September 3, 2025

ADB: 3 రోజులు వైన్స్ బంద్

image

ADB అబ్కారీ సర్కిల్ పరిధిలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా 3 రోజులు మద్యం దుకాణాలు బంద్ పాటించాలని ఎక్సైజ్ విజేందర్ పేర్కొన్నారు. ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు తాంసి, భీంపూర్, జైనథ్, మావల, ఆదిలాబాద్, అదేవిధంగా ఈనెల 5వ తేదీ సాయంత్రం 6 నుంచి 7వ తేదీ ఉదయం 10 వరకు బేల, తలమడుగు, జైనథ్, మావల, ఆదిలాబాద్‌లోని వైన్స్, బార్ షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని సూచించారు.

News September 3, 2025

ADB: ఈ నెలంతా 30 పోలీస్ యాక్ట్ అమలు

image

జిల్లాలో సెప్టెంబర్ నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.

News September 2, 2025

ADB: ఈనెల 6న ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

image

ADB: జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఈనెల 6వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రీడల్లో పాల్గొనాలనుకునే ఉద్యోగులు ఈనెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల్లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440765485, 9494956454 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.