News August 5, 2024

చైనా విషయంలో నీతి ఆయోగ్ సభ్యుడు కీలక వ్యాఖ్యలు

image

చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం కంటే FDIలను ఆహ్వానించి మనదేశంలోనే ఉత్పత్తి చేసుకోవడం మంచిదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ వీరమణి వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు రోజు విడుదలైన ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం. 2000- 2024 మధ్య FDI ఈక్విటీ ఇన్‌ఫ్లోలో చైనా కేవలం 0.37 శాతం వాటాతో 22వ స్థానంలో ఉంది.

Similar News

News December 11, 2025

‘అఖండ-2’ విడుదల: దెబ్బ మీద దెబ్బ

image

‘అఖండ-2’ సినిమాకు వరుస అడ్డంకులు ఎదురవుతుండటం నిర్మాతలు, ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. డిస్ట్రిబ్యూటర్ ఆర్థిక లావాదేవీల <<18474420>>సమస్యతో<<>> ఈ నెల 5న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తాజాగా ప్రీమియర్ షో టికెట్ల ధర పెంపు జీవోను TG హైకోర్టు సస్పెండ్ చేయడంతో అదనపు ఆదాయం పొందాలనుకున్న నిర్మాత ఆశలు అడుగంటాయి. కాగా ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి రిఫండ్ అవుతుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

News December 11, 2025

5 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు

image

SIR గడువు వారం రోజులు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత CEOల వినతులతో గడువు పొడిగించినట్టు తెలిపింది. యూపీ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్‌లో మరో వారంపాటు SIR కొనసాగనుంది. కాగా గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్, రాజస్థాన్, వెస్ట్‌ బెంగాల్‌లో ఈరోజుతో SIR ముగియగా DEC 16న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ కానుంది.

News December 11, 2025

విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంటు

image

AP: యోనెక్స్- సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2025 టోర్నమెంటు ఈనెల 24-28 తేదీల్లో విజయవాడలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను CM CBN ఆవిష్కరించారు. ఏపీలో పదేళ్ల తర్వాత ఈ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ టోర్నమెంటును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సీఎం వారికి సూచించారు.