News February 28, 2025
నితీశ్కుమార్ ఫిట్గా లేడు : ప్రశాంత్ కిషోర్

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శారీరకంగా అలసిపోగా, మానసికంగా రిటైర్డ్ అయ్యారని జన్సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. సరైన సంఖ్యాబలం లేకున్నా పొత్తులతోనే సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జేడీయూ ఒక్కసీటూ గెలవదని జోస్యం చెప్పారు. ఏప్రిల్లో జన్సూరజ్ పార్టీ పెద్దఎత్తున ర్యాలీ చేపట్టనుందని తెలిపారు. ఈఎన్నికల్లో తమ పార్టీ సంచలనం సృష్టించటం ఖాయమని పేర్కొన్నారు.
Similar News
News March 23, 2025
నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ

SLBC టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకొని నెల దాటింది. అయినా ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు. దీంతో సహాయక చర్యలపై NDRF, SDRF, ఆర్మీ తదితర విభాగాలతో TG CM రేవంత్ రెడ్డి రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.
News March 23, 2025
హీరోయిన్తో టాలీవుడ్ డైరెక్టర్ డేటింగ్?

సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తమిళ హీరోయిన్ బ్రిగిడా సాగాతో డేటింగ్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన భార్యతో దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల బ్రిగిడకు దగ్గరయ్యారని సినీ వర్గాలంటున్నాయి. ఈ పుకార్లపై వారు స్పందించాల్సి ఉంది. కాగా బ్రిగిడాతో శ్రీకాంత్ పెదకాపు-1 సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ సమయంలోనే వారి మధ్య స్నేహం చిగురించిందని సమాచారం.
News March 23, 2025
BRS రజతోత్సవ వేడుకలపై నేడు కేటీఆర్ సమీక్ష

TG: కరీంనగర్లో నేడు జరగనున్న BRS రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల నుంచి ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి రానున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వచ్చే నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై సమీక్షించడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.