News November 9, 2024

ఎవరు పడితే వాళ్లు రావడానికి దేశమేమీ ధర్మసత్రం కాదు: కేంద్రమంత్రి

image

ఎవరు పడితే వాళ్లొచ్చి సెటిలవ్వడానికి దేశమేమీ ధర్మసత్రం కాదని కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్ అన్నారు. ‘ఝార్ఖండ్లో చొరబాటు దారుల్ని JMM ప్రభుత్వం కీర్తిస్తోంది. ఓటు బ్యాంకుగా చూస్తోంది. వారు ఆధార్, రేషన్ కార్డులు పొందేలా సాయపడుతోంది. దాంతో సంతాల్ పరగణాలో గిరిజనుల జనాభా 44 నుంచి 28%కి పడిపోయింది. ఈ దేశం మనది. ఈ నేల, నీరు, అడవులు, కొండలు, పొలాలు మనవి. వీటిని మన నుంచి లాగేసుకోనివ్వొద్దు’ అని అన్నారు.

Similar News

News February 10, 2026

‘కవిత్వం నేర్చుకుంటా’.. ఆంథ్రోపిక్ ఇంజినీర్ రాజీనామా!

image

<<19068101>>టెక్ సంచలనం<<>> ‘ఆంథ్రోపిక్‌’లో ఏఐ సేఫ్టీ ఇంజినీర్ మృణాంక్ శర్మ రాజీనామా కలకలం రేపింది. ‘AI, బయో వెపన్లతోనే కాదు.. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే సంక్షోభాల వల్ల కూడా ప్రపంచం ప్రమాదంలో ఉంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామర్థ్యానికి సమానంగా మన జ్ఞానం పెరిగినట్లుగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. విలువలను కోల్పోతున్నామని, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని రాసుకొచ్చారు. కవిత్వంలో డిగ్రీ చేస్తానని తెలిపారు.

News February 10, 2026

చిన్నారి ప్రాణం తీసిన బాటిల్ మూత.. తల్లిదండ్రులారా జాగ్రత్త!

image

పలానా వస్తువు గొంతులోకి వెళ్తే ప్రమాదమని పసి పిల్లలకేం తెలుసు. కనిపించిందల్లా నోట్లో పెట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలాంటివి విషాదాలుగా మారుతాయి. అందుకే తల్లిదండ్రులే అప్రమత్తంగా ఉంటూ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. తాజాగా యాదాద్రి(D) భూదాన్(M) ఇంద్రియాలలో 18 నెలల భవ్యశ్రీ ఆడుకుంటూ కూల్‌ డ్రింక్ మూత మింగింది. గొంతులో ఇరుక్కోవడంతో చనిపోయింది. అందుకే పిల్లలకు మూతలు, నాణేలు వంటివి దూరంగా ఉంచాలి.

News February 10, 2026

హోం క్లీనింగ్ టిప్స్..

image

* ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు దూరమవుతాయి. * నూనె డబ్బాల మీద బంగాళా దుంప ముక్కలతో రుద్దితే తుప్పు మరకలు అంటుకోకుండా ఉంటాయి. * రెండు కప్పుల నీటిలో పావుకప్పు వెనిగర్, నాలుగు చుక్కలు పాత్రలు తోముకునే సబ్బు నీళ్ళు కలిపి, దానిలో ముంచిన వస్త్రంతో కిటికీలను తుడిస్తే పేరుకున్న దుమ్ముపోతుంది. * వెండి వస్తువుల గార పోవాలంటే పచ్చిపాలతో రుద్ది కడగాలి.