News December 31, 2024

రైతు భరోసాపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు: మంత్రి

image

TG: పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రైతు భరోసా విషయంలో క్యాబినెట్ నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. కాగా జనవరి 4న జరిగే క్యాబినెట్ భేటీలో రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది.

Similar News

News December 10, 2025

వనపర్తి: జీపీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న 5 మండలాలలో ప్రీ-పోల్ ఏర్పాట్లు పూర్తిచేశామని, అన్ని వైన్ షాపులు మూసివేశామని కలెక్టర్ వివరించారు.

News December 10, 2025

GWL: 974 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

image

గద్వాల, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో మొత్తం 974 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1,50,672 మంది ఓటర్ల డేటాను పరిగణలోకి తీసుకున్నామన్నారు. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 974 కేంద్రాల్లో 135 కేంద్రాలు ఏకగ్రీవ గ్రామాల పరిధిలోకి వస్తాయని వివరించారు.

News December 10, 2025

GWL: 974 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

image

గద్వాల, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో మొత్తం 974 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1,50,672 మంది ఓటర్ల డేటాను పరిగణలోకి తీసుకున్నామన్నారు. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 974 కేంద్రాల్లో 135 కేంద్రాలు ఏకగ్రీవ గ్రామాల పరిధిలోకి వస్తాయని వివరించారు.