News December 31, 2024
రైతు భరోసాపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు: మంత్రి
TG: పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రైతు భరోసా విషయంలో క్యాబినెట్ నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. కాగా జనవరి 4న జరిగే క్యాబినెట్ భేటీలో రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది.
Similar News
News January 24, 2025
వైసీపీ చేసిన మంచిని ప్రజలకు బలంగా చెప్పాలి: సజ్జల
AP: వైసీపీ చేసిన మంచిని ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన వర్క్ షాప్లో ఆయన మాట్లాడారు. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది కేవలం అపోహ అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిసైల్స్లా దూసుకెళ్లాలన్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు.
News January 24, 2025
Richest TV Star.. ఆస్తి రూ.5200 కోట్లు
ఆయన నటించరు. కనీసం పాడరు. డాన్సూ చేయరు. అయినా దశాబ్దకాలంగా హయ్యెస్ట్ పెయిడ్ టీవీ స్టార్గా గుర్తింపు పొందారు. ఏడాదికి రూ.650CR సంపాదిస్తారు. ఇప్పుడాయన నెట్వర్త్ ఏకంగా రూ.5200 కోట్లు. ఆయనే మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్, రియాల్టి షోస్ జడ్జి సైమన్ కోవెల్. The X Factor, Britain’s Got Talent, American Idol, America’s Got Talentకు జడ్జి. వీటితో పాటు Syco కంపెనీ ద్వారా ఆయనకు ఆదాయం వస్తుంది.
News January 24, 2025
విజయసాయి రెడ్డి.. ఇది ధర్మమా?: బండ్ల గణేశ్
రాజకీయాల నుంచి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుకోవడంపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. ‘అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. ఇది ధర్మమా!’ అని ట్వీట్ చేశారు.