News February 19, 2025
ఫడ్నవీస్తో ఎలాంటి విభేదాలూ లేవు: ఏక్నాథ్ షిండే

మహారాష్ట్ర ప్రస్తుత CM ఫడ్నవీస్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని డిప్యూటీ CM, ఏక్నాథ్ షిండే తెలిపారు. CMRFకి పోటీగా తాను వైద్యసహాయ కేంద్రాన్ని ప్రారంభించడంపై స్పష్టతనిచ్చారు. ‘అభివృద్ధిని అడ్డుకునేవారిపై కలిసి పోరాటం చేస్తున్నాం తప్ప మా మధ్య ఎలాంటి మనస్పర్థలూ లేవు. నేను CMగా ఉన్నప్పుడు ఫడ్నవీస్ కూడా ఇలాగే కేంద్రాన్ని నిర్వహించారు. ఇది సాయమందించేందుకే గానీ మా మధ్య పోటీ కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
BREAKING: ఏపీకి చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు మోదీకి పుష్పగుచ్ఛాలు అందజేసి వెల్కమ్ చెప్పారు. ప్రధాని అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు.
News October 16, 2025
LSG స్ట్రాటజిక్ అడ్వైజర్గా ‘కేన్ మామ’?

SRH తరఫున తన బ్యాటింగ్తో అలరించిన కేన్ విలియమ్సన్ కొత్త అవతారం ఎత్తనున్నారు. పంత్ సారథ్యం వహిస్తున్న LSGకి స్ట్రాటజిక్ అడ్వైజర్గా ఎంపికయ్యే ఛాన్సుంది. LSG జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి జహీర్ ఖాన్ తప్పుకున్నట్లు తెలియగా, ఆ స్థానాన్ని కేన్ రూపంలో భర్తీ చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. రానున్న మినీ ఆక్షన్లో కేన్ మామ సేవలను ఉపయోగించుకోవాలని LSG భావిస్తోంది.
News October 16, 2025
లాభాల్లో మొదలైన మార్కెట్లు

వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు గ్రీన్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 342 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బెల్, టైటాన్, మహీంద్రా&మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఎటర్నల్, టాటా మోటార్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉండగా ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.