News January 24, 2025
రూ.10 లక్షల వరకు నో IT?

నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. వార్షికాదాయం రూ.10లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, రూ.15లక్షల- రూ.20లక్షల ఆదాయం వరకు కొత్తగా 25% పన్ను శ్లాబ్ను తేవాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రూ.15లక్షల పైబడిన ఆదాయానికి 30% పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News February 8, 2025
‘అఖండ-2’లో విలన్గా క్రేజీ యాక్టర్?

సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన నటుడు ఆది పినిశెట్టి మరోసారి బోయపాటి శ్రీను మూవీలో విలన్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆది కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది విలనిజంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
News February 8, 2025
ఢిల్లీ రిజల్ట్స్: అత్యధిక మెజారిటీ ఎవరికంటే?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ(మటియా మహల్- 42,724 ఓట్లు)తో ఆప్ నేత మహమ్మద్ ఇక్బాల్ బీజేపీ అభ్యర్థి దీప్తిపై విజయం సాధించారు. మరోవైపు అత్యల్ప మెజార్టీ(344 ఓట్లు)తో సంగం విహార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ నెగ్గారు. ఓవరాల్గా ముగ్గురు BJP అభ్యర్థులు వెయ్యి లోపు మెజార్టీతో విజయం సాధించారు. పలు చోట్ల మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడటం గమనార్హం.
News February 8, 2025
నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

246 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ <