News August 9, 2024
ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా..!

పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ రేసు నుంచి డిస్క్వాలిఫై అయిన వినేశ్ ఫొగట్ హరియాణా ప్రభుత్వం రూ.4కోట్ల నజరానా ప్రకటించింది. ఆమె చదువుకున్న లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ రూ.25లక్షలు ఇస్తామని తెలిపింది. ఆమెపై గౌరవం, సానుభూతితో రివార్డులు ప్రకటిస్తున్నా.. మెడల్ సాధించలేకపోయాననే బాధే వినేశ్ను తొలిచేస్తోందేమో! ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా ఒలింపిక్స్ పతకానికి సాటి రావు. సగటు క్రీడాకారుడి జీవితలక్ష్యమది.
Similar News
News December 5, 2025
ఇండిగో సంక్షోభం.. కేంద్రం సీరియస్

ఇండిగో విమాన సర్వీసుల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. మూడు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని వెల్లడించింది. పైలట్ల రోస్టర్ సిస్టమ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పింది.
News December 5, 2025
ఇవాళే ‘అఖండ-2’ రిలీజ్?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రాన్ని ఇవాళ రాత్రి ప్రీమియర్స్తో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సమస్యలన్నీ కొలిక్కి రావడంతో ఏ క్షణమైనా మూవీ రిలీజ్పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. ఇవాళ సెకండ్ షోతో ప్రీమియర్స్, రేపు ప్రపంచవ్యాప్త విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. లేకపోతే ఈనెల 19కి రిలీజ్ పోస్ట్పోన్ కానున్నట్లు సమాచారం.
News December 5, 2025
మాలధారణలో ఉన్నప్పుడు బంధువులు మరణిస్తే..?

అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రక్తసంబంధీకులు మరణిస్తే వెంటనే మాల విసర్జన చేయాలి. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువు అయినందున గురుస్వామి వద్ద ఆ మాలను తీసివేయాలి. ఈ నియమం పాటించిన తర్వాత ఓ ఏడాది వరకు మాల ధరించకూడదు. అయితే దూరపు బంధువులు, మిత్రులు మరణిస్తే, మాలధారులకు ఎలాంటి దోషం ఉండదు. వారు మరణించినవారిని తలచుకొని, స్నానం చేసి స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>


