News February 15, 2025

జీబీఎస్ కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్

image

AP: గిలియన్ బార్ సిండ్రోమ్(జీబీఎస్) కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ చెప్పారు. కేసులు పెరగడానికి కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. మరణాల నివారణ చర్యల కోసం ఇతర రాష్ట్రాలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయన్నారు.

Similar News

News November 22, 2025

సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

image

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.

News November 22, 2025

తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం

image

ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ENG బౌలర్లను ఓపెనర్ హెడ్ ఊచకోత కోశారు. కేవలం 83 బంతుల్లోనే 123 రన్స్ బాదారు. లబుషేన్ 51* రన్స్‌తో రాణించారు.
స్కోర్స్: ENG- 172, 164.. AUS- 132, 205/2

News November 22, 2025

iBOMMA రవిని పోలీస్ శాఖలో నియమించుకోవాలి:CVL

image

iBOMMA రవిని అందరూ రాబిన్‌హుడ్‌లా చూస్తున్నారని సీనియర్ అడ్వొకేట్, నటుడు CVL నరసింహారావు చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడితే సినిమాల్లో ఒకరు పుట్టుకొస్తాడని, అదే తీరులో రవి వచ్చాడని తెలిపారు. నిర్మాతలు తప్ప అతనిపై సామాన్యులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఎంతో నాలెడ్జ్ ఉన్న రవిని శిక్షించడం కంటే పోలీస్ శాఖలో సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.