News February 15, 2025
జీబీఎస్ కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్

AP: గిలియన్ బార్ సిండ్రోమ్(జీబీఎస్) కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ చెప్పారు. కేసులు పెరగడానికి కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. మరణాల నివారణ చర్యల కోసం ఇతర రాష్ట్రాలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయన్నారు.
Similar News
News March 23, 2025
కాంగ్రెస్ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు: KTR

TG: ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా CM రేవంత్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండేదని రైతులు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై అసూయ, ద్వేషంతో దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే అని ఆరోపించారు.
News March 23, 2025
ఐపీఎల్లో రోహిత్ శర్మ చెత్త రికార్డు

రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్లో అత్యధికసార్లు(18) డకౌటైన ప్లేయర్గా దినేశ్ కార్తీక్, మ్యాక్స్వెల్ సరసన చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్, పీయూష్ చావ్లా(16) ఉన్నారు. ఇవాళ చెన్నైతో మ్యాచ్లో 4 బాల్స్ ఆడిన హిట్ మ్యాన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు వెళ్లారు.
News March 23, 2025
రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా?

ప్రస్తుత బిజీ జీవితంలో నిద్రాసమయం కుంచించుకుపోతోంది. ఎప్పుడు పడితే అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కానీ రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే నిద్ర నాణ్యత కోల్పోవడమే కాకుండా జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. అలాగే నిద్రలేచిన వెంటనే అలసట, నీరసంగా ఉండి ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. రోగనిరోధకశక్తి బలహీనపడి అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.